విశాఖలో అరుదైన సంఘటన
విశాఖలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీరామ నవమి ఉత్సవంలో హిందువులతో పాటు ముస్లింలు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఊరేగింపులో హిందువులు ముస్లమానులూ కలసి పండుగ చేసుకున్నారు. రాముడంటే ముస్లింలకు కిట్టదని, అల్లాను హిందువులు వ్యతిరేకిస్తారని ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకునే వాళ్ళందరికీ చోటు చేసుకున్న ఈ ఉత్సవం అవన్నీ అబద్దాలని, హిందూ ముస్లిములం భాయీ బాయిలమని చాటారు. శ్రీరామనవమి సందర్భంగా ఈస్ట్ షిరిడీ సాయిబాబా ఆలయ ఆధ్వర్యంలో విశాఖ చిన్న వాల్టేర్ లో హిందువులు ముస్లింలు కలిపి ఊరేగింపుగా వెళ్ళారు. మేళ తాళాలు, నృత్యాలు, గుర్రంపై పై ముస్లిం సంప్రదాయాన్ని చాటుతూ సాగినా ఈ ఊరేగింపు దృశ్యం హిందూ ముస్లిం భాయి భాయి అని ప్రపంచానికి చాటినట్లు అయ్యింది.
Tags :