జబర్దస్త్ గా దోచుకుంటున్న జబర్దస్త్ ఎమ్మెల్యే .. చంద్రబాబు..
ప్రజాగళం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజా ఒక జబర్దస్త్ ఎమ్మెల్యే అంటూ చంద్రబాబు సెటైర్ల వర్షం కురిపించారు. నగిరి లో ఉన్న జబర్దస్త్ ఎమ్మెల్యేకి ప్రజలను దోచుకోవడం తప్ప ఏమి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఆశ చూపి ఒక మహిళ దగ్గర 40 లక్షల రూపాయలు రోజా గుంజుకుంది అని చంద్రబాబు ఆరోపించారు. నగిరిలో ఇసుక మాఫియా.. గ్రావెల్ మాఫియా చేయడంలో రోజా కుటుంబం ఆరితేరిపోయింది అని అన్నారు. నగరిలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాను ప్రకాశ్ కు మద్దతునిస్తూ భారీ మెజారిటీతో గెలిపించాలి అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ముద్దు కృష్ణమ నాయుడు ని తలపించే విధంగా భాను ప్రకాష్ ప్రజలకు సేవ అందిస్తాడని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నగరిలో మూతపడ్డ చక్కెర కంపెనీని మళ్లీ తెరిపిస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.