బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్ టైమ్ హైకి ఇంకా కొంత దూరం ఉన్నప్పటికీ, గత ఐదు రోజులుగా ధరలు నిలకడగా పెరుగుతున్నాయి.
మార్చి 31న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు రూ.1,030 పెరిగి రూ.1,49,290కి చేరింది. 22 క్యారెట్ బంగారం రూ.950 పెరిగి రూ.1,36,850 వద్ద లభించింది.
18 క్యారెట్ బంగారం రూ.780 పెరిగి రూ.1,11,970 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర కిలో రూ.5,000 తగ్గి రూ.2,50,000కి చేరింది, తులం వెండి ధర రూ.2,500 వద్ద ఉంది.
గత ఐదు రోజుల ట్రెండ్ను గమనిస్తే , 10 గ్రాముల బంగారం ధరలో మొత్తం రూ.4,740 పెరుగుదల కనిపిస్తుంది. వెండి ధర కాస్త తగ్గినప్పటికీ, మార్కెట్ స్థితి బంగారం పై దృష్టి కేంద్రీకరించింది.
జనవరి 29న రికార్డు స్థాయి వద్ద 24 క్యారెట్ బంగారం రూ.1,78,850 ఉండగా, ఇప్పుడు రూ.1,49,290 వద్ద ఉంది. 22 క్యారెట్ బంగారం రూ.27,100 తగ్గి రూ.1,36,850 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. జనవరి 29న కిలో వెండి ధర రూ.4,25,000 ఉండగా, ప్రస్తుతం రూ.2,50,000 వద్ద లభిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఒక ఔన్స్ బంగారం 4,561 డాలర్ల వద్ద, వెండి 72.10 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
భారత మార్కెట్లో బంగారం ధరలను అంతర్జాతీయ ధరలు, పన్నులు, ఎక్స్చేంజ్ రేట్లు ప్రభావితం చేస్తాయి. పెట్టుబడిదారులు, ట్రేడర్లు తాజా ధరలను గమనించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి