ఉదయం ఖాళీ కడుపుతో సరైన ఆహారం తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి సహజంగా లభిస్తుంది. రోజంతా చురుకుగా ఉండేందుకు ఇది మంచి అలవాటు.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు వెళ్లేందుకు ఇది సహాయపడుతుంది.
నానబెట్టిన బాదం పప్పులు ఉదయం తింటే మెదడు పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.
ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. కడుపు ఉబ్బరం తగ్గి శరీరంలో మెటబాలిజం మెరుగుపడుతుంది.
నానబెట్టిన మెంతులు గింజలు ఖాళీ కడుపుతో తింటే షుగర్ నియంత్రణకు తోడ్పడతాయి. జీర్ణ సమస్యలు తగ్గి కడుపు తేలికగా ఉంటుంది.
ఈ అలవాట్లు రోజూ పాటిస్తే ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుంది. చిన్న మార్పులతోనే పెద్ద ప్రయోజనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.