2026 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 3న సంభవించనుంది. అదే రోజు హోలీ పండుగ ఉండటంతో దీనిపై ప్రత్యేక చర్చ జరుగుతోంది.
భారత్లో ఈ గ్రహణం కనిపించనున్నందున సూతక కాలం పాటించాలని పండితులు సూచిస్తున్నారు. అందుకే చాలా మంది ముందుగానే జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఆ సమయంలో ఆహారం విషయంలో నియమాలు పాటించాలనే ఆచారం ఉంది.
దర్భ లేదా గరక గడ్డి ఆహారంపై ఉంచడం పూర్వకాల సంప్రదాయం. ఇది ఆహారం శుద్ధిగా ఉండేందుకు సహాయపడుతుందని విశ్వాసం.
పాలు, పెరుగు, బియ్యం, వండిన అన్నం వంటి పదార్థాలపై దర్భ వేయాలని చెబుతారు. ఊరగాయలు, నిల్వ పప్పులు, చింతపండు పైనా ఇదే విధానం అనుసరిస్తారు.
తాగునీటి పాత్రలు, వంట గిన్నెలు, తాంబూలం పైనా దర్భ ఉంచుతారు. ఈ విధంగా గ్రహణ ప్రభావం తగ్గుతుందని భక్తులు నమ్ముతున్నారు.
గ్రహణ సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి స్థితి మార్పుల వల్ల ప్రతికూల శక్తులు పెరుగుతాయని పెద్దలవిశ్వాసం . ఆ ప్రభావం ఆహారంపై పడకుండా ఉండేందుకు దర్భ గడ్డి రక్షణగా పనిచేస్తుందని పెద్దలు భావిస్తారు.