నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. అదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన వచ్చే సూచనలు ఉన్నాయి.
కోస్తాంధ్రలో వేడితో పాటు ఉరుములు సంభవించవచ్చు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
సీమ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38-40°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడా జల్లులు కురవవచ్చు.
విజయవాడలో గరిష్టంగా 35-37°C, హైదరాబాద్లో 32–34°C ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. వేడి గాలుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన.
పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండకండి. వర్షం సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరించారు.