మొక్కలు వేగంగా పెరిగి పచ్చగా కళకళలాడాలంటే నాటే సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు.
మొక్క వేర్ల సైజును బట్టి కుండీని ఎంచుకోవాలి. వేర్లు పెరగడానికి తగినంత స్థలం ఉంటేనే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.
కుండీ అడుగున నీరు బయటకు పోవడానికి రంధ్రాలు ఉండాలి. లేదంటే నీరు నిలిచిపోయి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.
డ్రైనేజీ రంధ్రాలు
డ్రైనేజీ రంధ్రాలు మట్టితో మూసుకుపోకుండా ఉండటానికి, కుండీ అడుగున చిన్న పెంకులు లేదా రాళ్లను ఉంచాలి.
నల్లమట్టి, ఇసుక, మరియు కోకోపిట్ సమానంగా కలపాలి. ఇది మట్టిని గుల్లగా ఉంచి వేర్లకు గాలి ఆడేలా చేస్తుంది.
మట్టి మిశ్రమంలో వర్మీకంపోస్ట్ లేదా పశువుల ఎరువు కలపడం వల్ల మొక్కకు కావలసిన నైట్రోజన్, పోషకాలు అందుతాయి.
నర్సరీ కవర్ నుండి మొక్కను తీసేటప్పుడు వేర్లు దెబ్బతినకుండా చూడాలి. కుండీ మధ్యలో పెట్టి మట్టితో నింపాలి.
కుండీ పై అంచు వరకు మట్టి నింపకూడదు. నీరు పోయడానికి, ఎరువులు వేయడానికి పై వైపున రెండు అంగుళాల ఖాళీ ఉంచాలి.
మొక్క నాటిన వెంటనే కుండీ అడుగు రంధ్రాల నుండి నీరు వచ్చే వరకు సమృద్ధిగా పోయాలి. ఆ తర్వాత నీడలో ఉంచాలి.
మంచి మట్టి, సరైన నీరు, వెలుతురు, పోషకాలతో కుండీ మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అందంగా కనిపిస్తాయి.