మార్చి 23న ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచన ఉంది. తెలంగాణలో మాత్రం ఎండల ప్రభావం కొనసాగనుంది. అధికారిక వివరాలు ఇవే..
కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చు. వర్షం సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకండి.
హైదరాబాద్తో సహా తెలంగాణలోని మెజారిటీ జిల్లాల్లో మార్చి 23, 24 తేదీల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36°C నుండి 38°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.