మధుమేహం ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామందిని ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్య. ఒకసారి వస్తే పూర్తిగా తగ్గడం కష్టమే , కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నియంత్రణలో ఉంచుకోవచ్చు.
షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే ఆహారం ప్రభావం నేరుగా రక్తంలో చక్కెర స్థాయిలపై పడుతుంది అని గుర్తించాలి.
కాకరకాయ జ్యూస్ లో ఉండే కొన్ని సహజ కాంపౌండ్స్ ఇన్సులిన్లా పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
కాకరకాయ జ్యూస్ ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అయితే, సరైన మోతాదు కోసం వైద్యులను సంప్రదించడం ముఖ్యం.
ఉదయం ఒక గ్లాసు తాజా ఆకుకూరల రసం తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. ఇది షుగర్ లెవల్స్ను సమతుల్యం చేయడమే కాకుండా శక్తిని కూడా పెంచుతుంది.
అయితే కేవలం పానీయాలపైనే ఆధారపడకూడదు. ప్రతిరోజూ నడక లేదా తేలికపాటి వ్యాయామం అలవాటు చేసుకోవాలి.
మెంతులలోని ఫైబర్ చక్కెర గ్రహింపును నెమ్మదింపజేస్తుంది. రాత్రంతా నానబెట్టిన మెంతి నీటిని తాగి, గింజలను నమిలి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అద్భుతంగా అదుపులో ఉంటాయి.
తగినంత నీరు తాగితే రక్తంలో చక్కెర సాంద్రత తగ్గుతుంది; ఇది కిడ్నీల ద్వారా అదనపు షుగర్ను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
మధుమేహాన్ని నియంత్రించాలంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం. వైద్యుల సలహా తీసుకుంటూ జీవనశైలిలో మార్పులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
డయాబెటిస్ నియంత్రణకు 5 సులభమైన అలవాట్లు
కుంభ రాశిలోకి రాహు ప్రవేశం