కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
బాలనటిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన కీర్తి, నేను శైలజ మూవీతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది.
మొదటి మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించిన కీర్తి, తర్వాత మహానటితో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోల సరసన నటించిన కీర్తి ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఛాన్సులు అందుకుంటుంది.
ఎంతోమంది కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్ అయిన కీర్తికి ఓ హీరో అంటే ఎంతో ఇష్టమని చెప్పింది.
అతను మరెవరో కాదు, కోలీవుడ్ హీరో శింబు. అతనంటే కీర్తికి ఎంతో ఇష్టమట.
శింబుతో కలిసి ఎలాగైనా సినిమా చేయాలని తన మనసులోని మాటను కీర్తి బయటపెట్టింది.
శింబుతో ఒకట్రెండు సార్లు ఫోన్ లో మాట్లాడానని, ఎప్పటికైనా అతనితో సినిమా చేయాలని ఉన్నట్టు కీర్తి చెప్పింది.