ASBL NSL Infratech

డల్లాస్‌లో నాటా మహాసభలు... సీఎం జగన్‌ను ఆహ్వానించిన నాయకులు

డల్లాస్‌లో నాటా మహాసభలు... సీఎం జగన్‌ను ఆహ్వానించిన నాయకులు

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) డల్లాస్‌లో వచ్చే సంవత్సరం జూన్‌ 30 నుంచి జూలై 2 వరకు నిర్వహించనున్న నాటా తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రావాల్సిందిగా నాటా నాయకులు ఆయనను స్వయంగా కలిసి ఆహ్వానించారు. నాటా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆళ్ళ రామిరెడ్డి, కార్యదర్శి నారాయణ రెడ్డి గండ్ర ఇతర నాటా సభ్యులతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్‌ రెడ్డి భీమిరెడ్డి సీఎం క్యాంప్‌ కార్యాలయం వెళ్లి ఆయన్ని కలిసి నాటా మహాసభలకు రావాలని కోరారు. 

 

 

Tags :