ASBL NSL Infratech

అన్ని రంగాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది : సుచిత్ర ఎల్ల

అన్ని రంగాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది : సుచిత్ర ఎల్ల

తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని భారత్‌ బయోటెక్‌ ఎండీ  సుచిత్ర ఎల్ల తెలిపారు. విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ( గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌)లో సుచిత్ర ఎల్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిష్ఠాత్మకంగా భావించి సదస్సు నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. పలు కీలక రంగాల్లో ఏపీ పటిష్టంగా ఉందన్నారు. అన్ని రంగాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగిందన్నారు. ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని అన్నారు. సమ్మిళిత కృషి కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు.

 

 

Tags :