నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది మీరు కాదా?: షర్మిల
తాను అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల డిమాండ్ చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారు. నన్ను రాజకీయల్లోకి తెచ్చింది జగనన్న కాదా? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది ఆయన కాదా? నా భర్త, పిల్లల్ని వదిలేసి వేల కి.మీ పాదయాత్ర చేశా. మీ భవిష్యత్ కోసం కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదు. రాజకీయ కాంక్ష ఉంటే అప్పుడే పార్టీని హైజాక్ చేసేదాన్ని కాదా? మీ నుంచి పైసా సాయం కోరినట్టుయినా నిరూపించగలరా? మీరు వైఎస్ఆర్ కొడుకునని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రపంచంలో రాజకీయ విభేదాలు ఉన్నవాళ్లు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నారు. వేర్వేరు పార్టీలో ఉండి ఒకే కుటుంబంలో కొనసాగుతున్నవారు చాలా మంది ఉన్నారు అని జగన్కు కౌంటర్ ఇచ్చారు.