ASBL NSL Infratech

వైఎస్ భారతీపై ఎల్లో మీడియా విషప్రచారం..

వైఎస్ భారతీపై ఎల్లో మీడియా విషప్రచారం..

ఆంధ్రా లో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కుటుంబ సభ్యులకు కూడా ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు. అయితే ఎల్లో మీడియా పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేయడానికి పూనుకున్న ఆయన సతీమణి భారతి రెడ్డి పై విషప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సహాయంగా ఆయన ధర్మపత్ని భువనేశ్వరి వస్తే ఆహా ఓహో అన్నారు.. లోకేష్ కి సహాయంగా బ్రాహ్మణి బరిలోకి దిగితే..భర్తకు చేదోడు అని మెచ్చుకున్నారు. మరోపక్క బాలయ్య కోసం నందమూరి కుటుంబం కదలి వస్తే.. పొగిడారు. పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ ముందుకు వస్తే .. మెచ్చుకున్నారు. కానీ భర్త కోసం భారతి ముందుకు వస్తే మాత్రం ఓటమి భయం అని ఎద్దేవా చేస్తున్నారు.

రాజకీయాలలో ప్రత్యర్ధులు చేసిన మంచి చెడుల గురించి మాట్లాడడం పద్ధతిగా ఉంటుంది కానీ మరి పర్సనల్గా వెళ్లి కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి ఆడవారిని సైతం కించపరిచేలా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం చెప్పండి. భర్తను గెలిపించమని ఇంటింటికి వెళ్లి వైసీపీ తరఫున భారతీ ప్రచారం చేపట్టారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా.. గతంలో భారతీ ప్రచారం చేసిన కేవలం కొన్ని ప్రాంతాలలో సభలు పెట్టి సరిపెట్టేవారని.. ఇప్పుడు ఓటమి భయంతో ఇంటింటికి వెళ్లి బతిమిలాడుకుంటున్నారని కథనాలు సృష్టించి వార్తలు వైరల్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ అందరూ మర్చిపోతున్నది గడపగడపకు ప్రోగ్రాం అనేది వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. తమ ప్రభుత్వం ద్వారా ప్రజలకు కలిగిన లబ్ధిని మరొకసారి గుర్తు చేయడమే ధ్యేయంగా ఈ ప్రోగ్రామ్ని సృష్టించారు. పులివెందులలో జగన్ సతీమణి గా భారతి పార్టీ పద్ధతిని ఫాలో అవుతున్నారు. అందుకే అలాగే ప్రచారం చేస్తున్నారు. కానీ దీన్ని కూడా వక్రంచి ఎల్లో మీడియా అనవసపు రాజకీయాలు చేస్తోంది. దీనిపై వైసీపీ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

 

 



praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :