ప్రతి ఇంటికి వెళ్లి చేయడం అమెరికాలో చూసా...మళ్లీ ఏపీలో : ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ యార్లగడ్డ
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని వైసీపీ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ యార్లగడ్డ వెంకట రమణ తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను వెబ్సైట్ను నుంచి తీసేసిన ఘనత టీడీపీది అని ఎద్దేవా చేశారు. అప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుల రుణమాఫి, డ్వాక్రా రుణమాఫీ, ఆడపిల్ల పుడితే 25 వేల అకౌంట్లో వేస్తాం. నిరుద్యోగ భృతి వంటి హామీల్లో ఒక్కటి అమలు కాలేదన్నారు. అందుకే ఇప్పుడు చంరదబాబు మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం చేసిన నాయకుడు జగన్ అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందించారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి పథకాలు అమలు చేయడంలో అమెరికాలో చూసా మళ్లీ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నట్లు తెలిపారు.