పిఠాపురంలో వంగా గీత సైలెంట్ గేమ్..
ఎన్నికల ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రాలో ఎక్కడ విన్న తమ ప్రత్యర్థులపై అభ్యర్థులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. గట్టిగా అరవడం.. వేదికలెక్కి ప్రసంగాలు ఇవ్వడం.. కేకలు పెట్టడం మామూలుగా అయిపోయింది. సవాళ్లకు.. ప్రతిసవాళ్లు.. నువ్వా నేనా అనే పంతాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అయితే పిఠాపురంలో వంగా గీత మాత్రం సైలెంట్ గా చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. దీనివల్ల ఆమెపై ప్రజలలో ఓ సానుకూలత ఏర్పడుతోంది అన్న వాదన కూడా వినిపిస్తుంది.
ఒకపక్క పవన్ మైకు పట్టుకుని జగన్ తిట్టడమే కాకుండా డిస్కో డాన్స్ వేసినట్టు ఊగిపోతున్నాడు. మరోపక్క గీత ఎంతో సమన్వయం పాటిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొంటూ.. పవన్ పేరు రాకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. దీంతో ప్రజలకు ఆమెపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రత్యర్థి గురించి అస్సలు మాట్లాడకుండా.. కేవలం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో చేసిన మంచి గురించి చెబుతూ.. తిరిగి తనని ఎమ్మెల్యే చేస్తే చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ.. ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ఆప్యాయంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికైనా పవన్ మేలుకోకపోతే పిఠాపురం లో పరిస్థితి తిరగబడే అవకాశం ఉంది.