ఈ ఎన్నికల్లో మేం అద్భుత విజయం : మంత్రి ఉత్తమ్
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్లో చేరుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలవాలని చూస్తున్నాయని విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఏమీ చేయలేదు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది. దానిని జీర్ణించుకోలేకే బీజేపీ ఏదేదో మాట్లాడుతోంది. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ ఎన్నికల్లో మేం అద్భుత విజయం సాధించడం ఖాయం. మా పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి అని అన్నారు.
Tags :