హోం మంత్రిపై టీడీపీ కార్యకర్తల దాడి..
ఆంధ్రాలో ఏదో జరిగిపోతోంది అన్నట్టు హడావిడిగా అధికారులను మార్చడం.. ఆంక్షలు విధించడం జరుగుతోంది. అయితే నిన్న సాక్షాత్ హోం మంత్రిపై జరిగిన దాడితో ఎన్నికల కమిషన్ చేతిలో శాంతిభద్రతాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ అర్థమయిపోయింది. ఇదంతా టీడీపీ కుట్ర పూరిత చర్యగా అందరూ భావిస్తున్నారు. కక్ష కట్టి మరి కావాలని పోలీసు అధికారుల బదిలీ చేయించడం.. తమకు అనుకూలమైన వారిని ఆస్థానంలో వచ్చేలా చేసుకోవడం.. ఇదంతా చంద్రబాబు కుట్ర అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
హోం మంత్రి తానేటి వనిత పై టీడీపీ నేతలు దాడికి పాల్పడడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. మంగళవారం అర్ధరాత్రి నాడు గోపాలపురం నల్లజర్ల లో టీడీపీ శ్రేణులు హోమ్ మంత్రిపై దాడికి తెగబడ్డాయి. స్థానికంగా ప్రచారం ముగించుకొని విశ్రాంతి తీసుకోవడానికి మాజీ జడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి హోం మంత్రి తానేటి వనిత చేరుకునే సమయానికి.. అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేశాయి. దీంతో మొదలైన గొడవ తానేటి వనితపై దాడి వరకు వెళ్ళింది. గొడవ జరుగుతున్న సమయంలో హోం మంత్రిపై దూసుకుపోవడానికి కొందరు కార్యకర్తలు ప్రయత్నించారు. అప్పటికే అలర్ట్ గా ఉన్న ఆమె సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో సమస్య పెద్దది కాకుండా ఆగింది. అయితే అంతటితో సరిపెట్టుకోకుండా టీడీపీ కార్యకర్తలు సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద ఉన్న వాహనాలను ధ్వంసం చేసి.. ఇంట్లో ఫర్నిచర్ ని కూడా విరగ్గొట్టారు. అడ్డు వచ్చినా వైసీపీ కార్యకర్తలను గాయపరిచారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తు ప్రారంభించారు.