ASBL NSL Infratech

టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ గా మారిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌‌..

టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ గా మారిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌‌..

ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగబోతున్న తరుణంలో ఎలాగైనా అధికార పార్టీపై ప్రజలలో అసంతృప్తి కలగజేయాలి అనే ఉద్దేశంతో టీడీపీ ఎంచుకున్న ప్రధాన అస్త్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీని గురించి ఎవరికీ పూర్తిగా తెలియకపోయినా ఫేక్ ప్రచారం చేయిస్తూ ఉండడంతో ఇప్పటికే టీడీపీ పై ఏపీ సి ఐ డి కేసు బుక్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ విషయంలో బయటపడ్డ ఒక వీడియో తో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ వేసినట్లు అయింది.వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి టీడీపీ రైట్ హ్యాండ్ అయినా రామోజీరావుకు చెందిన ఈటీవీ ఛానల్ నందు అన్నదాత కార్యక్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించిన ఒక వీడియోని బయట పెట్టారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా అందులో ఈ యాక్ట్ గురించి చెడుగా మాట్లాడలేదు.. పైగా దానివల్ల జరిగే మేలును వివరించారు.

అంతేకాదు ఏపీ అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సమర్థిస్తున్నట్లుగా టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడిన వీడియోను కూడా సజ్జల బయటపెట్టారు. భూ కబ్జాలు చేయడానికి అలవాటు పడిపోయిన చంద్రబాబు లాంటి వాళ్లకు ఇటువంటి చట్టాల వల్ల కష్టం కలగవచ్చు.. సామాన్య ప్రజానీకానికి కాదు అని సజ్జల ఈ సందర్భంగా చెప్పారు. పచ్చ మీడియా బలంతో చంద్రబాబు చేస్తున్న ఫేక్ ప్రచారాలను ఇకనైనా ప్రజలు గుర్తించాలని కోరారు. ఇంకా రూపకల్పన దశలోనే ఉన్న ఒక చట్టంపై.. ప్రజలలో తీవ్రవ్యతిరేకత తీసుకువచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డిని అన్ పాపులర్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆరోపించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :