ASBL NSL Infratech

ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి టీడీపీ కృషి : కోమటి జయరాం

ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి టీడీపీ కృషి : కోమటి జయరాం

టీడీపీకి మద్దతిస్తున్న ఎన్నారైల్ని వైసీపీ నేతలు ఉగ్రవాదుల్లా చిత్రీకరిస్తున్నారని టీడీపీ ఎన్నారై విభాగం సమన్వయకర్త కోమటి జయరాం ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి టీడీపీ కృషి చేసిందని గుర్తు చేశారు. తెలుగు ప్రజల అభ్యున్నతికి దోహదపడాలనే ఉద్దేశంతో ఎన్నారైలంతా ఈ ఎన్నికల్లో పని చేయాలని తాను చెప్పిన మాటల్ని వైసీపీ నాయకులు వక్రీకరిస్తున్నారని ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నారంటే, అందుకు చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలే కారణం. అలాంటి వ్యక్తిని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. రాష్ట్ర హితం కోసం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ప్రవాసాంధ్రుల లక్ష్యం అని జయరాం సృష్టం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :