శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి సున్నిపెంటకు హెలికాప్టర్లో వెళ్లి, అక్కడి నుంచి కాన్వాయ్లో సాక్షి గణపతి ఆలయానికి చేరుకున్నారు. అక్కడినుంచి శ్రీశైలం ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు దంపతులకు మహాద్వారం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చంద్రబాబు దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. చంద్రబాబు వెంట మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, టీడీపీ నేతలు ఏరాసు ప్రతాప రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, బీసీ జనార్దన్ రెడ్డి, మల్లెల రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Tags :