అతిలోక సుందరికి అరుదైన గౌరవం...ముంబైలో
బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి అరుదైన ఘనత అందుకుంది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉన్న లోఖండ్వాలా కాంప్లెక్స్లో ఒక జంక్షన్కి అక్కడి ప్రజలు శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. శ్రీదేవి, బోనీ కపూర్తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్లు ఇంతకుముందు ఇదే ప్రాంతంలో నివసించారు. శ్రీదేవి మరణించిన అనంతరం షిప్ట్ అయ్యారని స్థానిక ప్రజలు తెలిపారు.
Tags :