సిద్దు సినిమా బడ్జెట్ పెరిగింది
డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ సినిమాలతో తన టాలెంట్ ను నిరూపించుకున్న సిద్దు జొన్నలగడ్డ ముందు చిన్న చిన్న పాత్రల్లో నటించి, ఆ తర్వాత హీరోగా మారాడు. ప్రస్తుతం కెరీర్లో సూపర్ ఫామ్ లో ఉన్న సిద్దు తన తర్వాతి సినిమాల విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం సిద్దు చేతిలో రెండు సినిమాలున్నాయి. అవే జాక్ మరియు తెలుసు కదా.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జాక్ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. టిల్లు స్వ్కేర్ రూ.100 కోట్ల మార్క్ ను దాటడంతో జాక్ సినిమాకు బడ్జెట్ ను పెంచినట్లు తెలుస్తోంది. టిల్లు స్వ్కేర్ రిజల్ట్ చూశాక జాక్ నిర్మాత భోగవల్లి ప్రసాద్, ఈ సినిమాకు ఇంకాస్త బడ్జెట్ పెంచినా వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారట.
దీంతో పాటూ నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న తెలుసు కదా సినిమాలో కూడా సిద్దు మార్క్ హంగామా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్దు సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండింటితో పాటూ టిల్లు క్యూబ్ కూడా వచ్చే ఏడాదే రానుంది. ఇప్పటికే టిల్లు గా రెండు సార్లు హిట్ అందుకున్న సిద్దు ఈసారి టిల్లు క్యూబ్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.