ప్రధాని మోదీ పై మిమిక్రీ కళాకారుడు పోటీ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోటీ చేయనున్నట్లు మిమిక్రీ కళాకారుడు, కమెడియన్ శ్యామ్ రంగీలా(29) ప్రకటించారు. రాజస్థాన్కు చెందిన ఆయన ప్రధాని మోదీ గొంతును అనుకరిస్తూ మిమిక్రీ చేయడంతో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ ఇప్పటికీ దేశంలో ప్రజాస్వామ్యం జీవించే ఉందని తెలియజేయడానికే ప్రధానిపై పోటీకి దిగుతున్నాను అని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ఈ వారాంతంలో ఆయన వారణాసి చేరుకోనున్నారు. వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన ప్రధాని మోదీ మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తానని దీమాగా ఉన్నారు.
Tags :