ASBL NSL Infratech

మెగా బ్రదర్స్ పై మండిపడ్డ పోసాని కృష్ణమురళి..

మెగా బ్రదర్స్ పై మండిపడ్డ పోసాని కృష్ణమురళి..

వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మరొకసారి పవన్ గురించి వ్యాఖ్యానించారు. జగన్ ప్రజల కోసం పార్టీ స్థాపించారని చెప్పిన పోసాని.. మెగా కుటుంబం కేవలం పైసల కోసం మాత్రమే పార్టీ పెట్టిందని విమర్శించారు. మెగా బ్రదర్స్ కు.. జగన్ కి మధ్య ఉన్న తేడా అదే అంటూ పోసాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలకు వస్తున్న జనం కూడా అతనికి ఓటు వేయరని.. వాళ్లంతా నోట్ల కోసం మాత్రమే సభలకు వస్తున్నారా పోసాని పేర్కొన్నారు. కానీ జగన్ నిర్వహిస్తున్న సభలకు ప్రజలు నిజంగా.. మనస్ఫూర్తిగా వస్తున్నారని పోసాని అన్నారు. జగన్ ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఎంతో మర్యాదగా మాట్లాడుతారని.. కానీ జనసేనాని పూనకం వచ్చినట్లు ఊగుతారు అని పోసాని వ్యాఖ్యానించారు. అప్పుడు అన్న తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే.. ఇప్పుడు తమ్ముడు కూటమి అంటూ టీడీపీ వెనుక తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :