మెగాస్టార్ పై పోసాని మెగా విమర్శలు..
ఈసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గతం కంటే కూడా ఎంతో హాట్ గా ఉన్నాయి. పోలింగ్ కి కౌంటన్ మొదలు కావడంతో.. ఏపీ రాజకీయాలలో అసలు సిసలు రసవత్తర సన్నివేశాలు మొదలయ్యాయి. ప్రధానంగా జరుగుతున్న ప్రచార కార్యక్రమాలకు.. కౌంటర్లు.. విమర్శలు చేసేవారు ఎక్కువైపోతున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని మెగా మెగాస్టార్ చిరంజీవి పెట్టిన వీడియో పై పోసాని కృష్ణమురళి స్పందించారు. అసలు రాజకీయాలకే దూరం అనుకున్న వ్యక్తి.. పవన్ ను గెలిపించమని ఎలా అడుగుతారు అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ విషయాన్ని గుర్తు చేస్తూ.. చిరంజీవి మాటలు ఎందుకు నమ్మాలి అని నిలదీస్తున్నారు. చిరంజీవికి నిజంగా ప్రజలంటే లెక్కలేదని.. అందుకే ప్రజాసేవ చేస్తానని పార్టీ పెట్టి దాన్ని మూసేశారని పోసాని విమర్శించారు. 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో విలీనం చేసి.. అప్పట్లో చిరంజీవి తన సామాజిక వర్గాన్ని నిరాశకు గురి చేశారని పోసాని గుర్తు చేశారు.