పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్, ఓయు విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా పంతంగి టోల్టేగ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఏటా వసతి గృహాల మెస్ల మూసివేతపై ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అధికారులు సర్క్యూలర్ జారీ చేయగా, వాటిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగించినట్టు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్రిశాంక్, నాగేందర్ను అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు.
Tags :