కుప్పం సాక్షిగా చంద్రబాబు పరిస్థితి అదే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
ఈసారి కుప్పంలో చంద్రబాబు రాజకీయం భూస్థాపితం కావడం ఖచ్చితమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని..అందుకు ప్రజల చంద్రబాబుకి బుద్ధి చెబుతారని.. ఆయన పేర్కొన్నారు. ఓటమి భయం తో చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయం నుంచి కుప్పంలో వైసీపీ హవా మొదలైందని.. అందుకే మెల్లమెల్లగా టీడీపీ నేతలందరూ వైసీపీలోకి వలసబాట పడుతున్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అందుకే చంద్రబాబుకి భయం మొదలైందని.. భరత్ తనకు దీటైన అభ్యర్థుడని భావించి కుటుంబాన్ని మొత్తం కుప్పంలో దించుతున్నారని విమర్శించారు. కుప్పంలో టీడీపీ పునాదులు కదల్చడంలో పెద్ద పాత్ర పోషించిన తన పై కావాలని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని.. పెద్దిరెడ్డి ఆరోపించారు. పెద్దిరెడ్డి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని.. ఎల్లో మీడియాతో ప్రచారం చేయిస్తున్నారు. దీనిపై స్పందించిన పెద్దిరెడ్డి.. కుప్పంలో ఓడిపోతాను అనే భయంతో చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.