ఏపీలో కాలు పెడితే చంపేస్తామంటున్నారు : సీఈవోకు ఎన్నారై యశస్వి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్లో కాలు పెడితే చంపేస్తామని వైసీపీ కార్యకర్తలు, రౌడీల నుంచి నాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి అని ఎన్నారై టీడీపీ నాయకుడు బొద్దులూరి యశస్వి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. టీడీపీ తరపున ప్రచారం చేస్తే, చంపేస్తామని పదేపదే బెదిరిస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి సచివాలయంలో సీఈవో ముకేష్ కుమార్ను కలిసి, ఫోన్ కాల్స్ డేటాను అందించి, తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
Tags :