ASBL NSL Infratech

విజయవాడలో అట్టహాసంగా ఎన్డీయే కూటమి రోడ్ షో..

విజయవాడలో అట్టహాసంగా ఎన్డీయే కూటమి రోడ్ షో..

ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరును పెంచాయి. మరొక మూడు రోజుల్లో దాదాపుగా ప్రచారం పూర్తయిపోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ముగ్గురు భారీ రోడ్ షో నిర్వహించారు. ఒకే వేదికపై ముగ్గురు నేతలు ఉండడంతో జనం కూడా ఈ రోడ్ షో కి భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎక్కడ చూసినా మూడు పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి.. ఎన్డీఏ కూటమి కోలాహలం ఈ రోడ్ షోతో మిన్నంటింది. ఒకే వాహనంపై.. ప్రజలకు అభివాదం చేస్తూ త్రిమూర్తుల్లా ఈ ముగ్గురు నేతలు రోడ్ షోలో ముందుకు సాగుతున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :