విజయవాడలో అట్టహాసంగా ఎన్డీయే కూటమి రోడ్ షో..
ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరును పెంచాయి. మరొక మూడు రోజుల్లో దాదాపుగా ప్రచారం పూర్తయిపోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ముగ్గురు భారీ రోడ్ షో నిర్వహించారు. ఒకే వేదికపై ముగ్గురు నేతలు ఉండడంతో జనం కూడా ఈ రోడ్ షో కి భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎక్కడ చూసినా మూడు పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి.. ఎన్డీఏ కూటమి కోలాహలం ఈ రోడ్ షోతో మిన్నంటింది. ఒకే వాహనంపై.. ప్రజలకు అభివాదం చేస్తూ త్రిమూర్తుల్లా ఈ ముగ్గురు నేతలు రోడ్ షోలో ముందుకు సాగుతున్నారు.
Tags :