ASBL NSL Infratech

15 నిమిషాలు కాదు..15 సెకన్లు చాలు : నవనీత్ రాణా వార్నింగ్

15 నిమిషాలు కాదు..15 సెకన్లు చాలు  : నవనీత్ రాణా వార్నింగ్

15 నిమిషాల పాటు పోలీసుల్ని తొలగిస్తే, మేం ఏం చేస్తామో చేసి చూపిస్తామని 11 ఏళ్ల క్రితం ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ ఓ సందర్భంలో వార్నింగ్‌ ఇచ్చారు. అయితే హిందువులను ఉద్దేశించి ఆయన వార్నింగ్‌ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు బీజేపీ నేత నవనీత్‌ రాణా కౌంటర్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ ఎపీ అభ్యర్థి మాధవీ లత తరపున ప్రచారం చేస్తున్న ఆమె మాట్లాడుతూ 15 నిమిషాలు కాదు, తమకు 15సెకన్లు సరిపోతుందని నవనీత్‌ రాణా అన్నారు. హైదరాబాద్‌ను పాకిస్థాన్‌గా మార్చకుండా ఉండేందుకు మాధవీ లత అడ్డుకుంటుందని కూడా అన్నారు. కాంగ్రెస్‌కు కానీ ఎంఐఎంకు కానీ ఓటేస్తే, పాకిస్థాన్‌కు అనుకూలంగా ఓటేసినట్లు అవుతుందని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :