ఆ పార్టీకి మరోసారి అధికారం ఇస్తే.. ఇంకేం మిగలదు
వైసీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నాశనమైందని, మరోసారి అధికారం ఇస్తే ఇంకేం మిగలదని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో కియా, అమరరాజ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు రాష్ట్రం నుంచి వెల్లిపోయాయన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నీతి, నిజాయతీ ఉన్న పవన్ కల్యాణ్ పరిపాలన దక్షత ఉన్న చంద్రబాబు, దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోదీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
Tags :