కులాల మధ్య చిచ్చు.. కుటుంబాల మధ్య గొడవలు..ఇదే చంద్రబాబు మార్క్ రాజకీయం
చంద్రబాబు అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడని వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం.. కుటుంబాలను సైతం విడదీయడం చంద్రబాబు రాజకీయం స్పెషాలిటీ అని ఆయన మండిపడ్డారు. ఒకప్పుడు కేవలం కులం పేరుతో మనుషుల్ని రెచ్చగొట్టి రాజకీయం చేసే చంద్రబాబు ఇప్పుడు మరింత దిగజారి కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారని మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో ముద్రగడ ఆరోపించారు. ఇటీవల జగన్ కుటుంబంలో ఇదే రకంగా చంద్రబాబు చిచ్చు పెట్టారని.. ఇప్పుడు తన కుటుంబంలో కూడా చిచ్చు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అధికార దాహం ఉన్న వ్యక్తిని అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి పవన్ కళ్యాణ్ తపిస్తున్నారని.. ప్రజలు దీనిని అడ్డుకోవాలని ముద్రగడ పిలుపునిచ్చారు.. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో తనను ఎంతగా వేధించారో.. ఎన్ని అవమానాలకు గురి చేశారో మర్చిపోలేని ఈ సందర్భంగా ఆయన వాపోయారు. ఇక మేనిఫెస్టో ల గురించి ప్రస్తావించిన ముద్రగడ.. పేదవాడి ఆఖరి తీర్చే మేనిఫెస్టో జగన్ ది అయితే.. మోసం చేసే మేనిఫెస్టో చంద్రబాబుది అని వ్యాఖ్యానించారు. తాను ఎందరో ముఖ్యమంత్రులను చూశానని.. కానీ ఇలా హామీల పేరుతో చేయలేని పనుల గురించి వాగ్దానాలు చేసి.. ప్రజలను మోసం చేసే చంద్రబాబు లాంటి వ్యక్తిని చూడలేదని పేర్కొన్నారు. ప్రజలే జగన్కు అండగా నిలిచి ఆయన్ని గెలిపించాలని కోరారు.