ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖతం: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖతం: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయందని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారని, ఇక ఆ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్.. కేంద్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఇక కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదని విమర్శించారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, అందుకే ఈ లోక్‌సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు పార్టీలన్నీ కలిసిరావాలని పిలుపునిచ్చారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :