ASBL NSL Infratech

రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత.. వారికి రూ.15 వేలు ఇస్తాం : మంత్రి తుమ్మల

రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత.. వారికి రూ.15 వేలు ఇస్తాం : మంత్రి తుమ్మల

ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్‌ కిసాన్‌ మోర్చా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు అండగా ఉంటుందని తెలిపారు. తడిసిన ధానాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని వివరించారు. రాబోయే బడ్జెట్‌ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని తెలిపారు. పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :