ఆ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ లోకి : మంత్రి కోమటిరెడ్డి
తనకు పదవులపై ఆశలేదని, రానున్న పదేళ్లూ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైలులో ఉన్న బీఆర్స్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. త్వరలోనే బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. ఆ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్లో చేరతారని తెలిపారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారన్నారు. డీలిమిటేషన్తో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 154కి చేరుతుందని, అందులో 15 చోట్ల కాంగ్రెస్ గెలుస్తుందని వ్యాఖ్యానించారు.
Tags :