హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్
హైదరాబాద్లో సిగలో మరో కలికి తురాయి చేరబోతోంది. ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను మరింత విస్తరించబోతోంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో రూ.267 కోట్లతో 48 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18వ తేదీన దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. కాగా, ఈ డాక్యుమెంట్ల ప్రకారం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ( ఇండియా) ఒక్కో ఎకరానికి రూ.5.56 కోట్లు చెల్లించింది. అదేవిధంగా డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఇప్పటికే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో రూ.275 కోట్లతో భూమిని కొనుగోలు చేసింది.
Tags :