ASBL NSL Infratech

రాష్ట్రపతి చేతుల మీదుగా విశిష్ట పురస్కారాలు అందుకున్న వెంకయ్య నాయుడు.. చిరంజీవి..

రాష్ట్రపతి చేతుల మీదుగా విశిష్ట పురస్కారాలు అందుకున్న వెంకయ్య నాయుడు.. చిరంజీవి..

ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నందు ఈరోజు సాయంత్రం పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రధానం చేశారు. తెలుగు జాతి గర్వించే విధంగా ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ప్రజా సంబంధిత వ్యవహారాలలో విశిష్ట సేవలను అందించినందుకు కేంద్రం వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. అలాగే దశాబ్దాలుగా చలనచిత్ర రంగానికి చిరంజీవి అందించిన కళా సేవకు గుర్తింపుగా ఆయనకు కూడా పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఇది దేశంలోనే రెండో అత్యున్నతమైన పౌర పురస్కారం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ సినీ ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :