మాధవిలత ఓ పెద్ద కమెడియన్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్ లో లోక్ సభ ఎన్నికల జోరు బాగా ఎక్కువైపోయింది. ఎండ వేడి కంటే కూడా ఎన్నికల వేడి తెలంగాణలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కామన్ అయిపోయింది. తాజాగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓవైసీ అసదుద్దీన్ గెలుపు ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు మాధవి లత ఒక కమెడియన్ అని.. క్షేత్రస్థాయిలో ఆమె గురించి ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మాధవి లత తనని తాను ఫూల్ చేసుకుంటుందని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలు అనేవి చిన్నపిల్లల ఆట కాదు.. వాటిని ఎంతో సీరియస్గా తీసుకోవాలి.. ప్రచారానికి వెళ్లిన ఒక నాయకురాలు బాణాలు సంధించడం.. వీధుల్లో డాన్సులు వేయడం తగదని కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో వరదలు వచ్చినప్పుడు బీజేపీ ఏమాత్రం స్పందించలేద.. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరి అలాంటిది ప్రజలు బీజేపీ ను ఎలా నమ్ముతారు అని ప్రశ్నించారు.