ASBL NSL Infratech

పసుపు తీర్థం పుచ్చుకున్న కోడి కత్తి శీను.. 

పసుపు తీర్థం పుచ్చుకున్న కోడి కత్తి శీను.. 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న కోడి కత్తి శీను తన కుటుంబంతో కలిసి పసుపు తీర్థం పుచ్చుకున్నాడు. అంతేకాదు అతను ఈసారి ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలోకి దిగాలి అనుకున్నాడట. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో టీడీపీ లో చేరినట్టు పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అతనికి మద్దతు ఇచ్చి పార్టీలోకి ఆనందంగా ఆహ్వానించారు. ఇంతవరకు బాగుంది కానీ టీడీపీ వారు నిందలు ఎదుర్కొంటున్న వారిని.. హత్య కేసుల్లో ముద్దాయిలుగా పరిగణించే వారిని ప్రశ్నిస్తారు కదా? అవినాష్ విషయంలో వీరందరూ ఒకటే చేస్తున్నది అదే కదా. మరి ఇప్పుడు కోడి కత్తి శీను విషయంలో మాత్రం వాళ్లు ఎందుకు అంత జాలి చూపిస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. తాను ఈరోజు బతికి ఉన్నాను అంటే ముఖ్య కారణం తనకోసం పోరాడిన ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలు అని జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను పేర్కొన్నాడు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :