ASBL NSL Infratech

నా ప్రమాణ స్వీకారం విశాఖ లోనే తేల్చి చెప్పిన జగన్..

నా ప్రమాణ స్వీకారం విశాఖ లోనే తేల్చి చెప్పిన జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తా నని జగన్ తేల్చి చెప్పారు. తాను గెలిచిన తర్వాత విశాఖను పరిపాలన రాజధానిగా చేయడం తోటే తన సీఎం బాధ్యతలు తీసుకుంటాను అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్ఛాపురంలో నిర్వహించినటువంటి రోడ్ షోలో పాల్గొన్న జగన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేసింది తానేనని జగన్ పేర్కొన్నారు. ముగ్గులు కలెక్టర్లు..ముగ్గురు ఎస్పీ లతో సరిపెట్టిన ప్రాంతానికి ఆరుగురు కలెక్టర్లను.. ఆరుగురు ఎస్పీలను నియమించి అధికార వికేంద్రీకరణ చేసి పాలన సజావుగా జరిగేలా చూసానని జగన్ చెప్పారు. అలా చేయడం వన్నీ ప్రభుత్వ పాలన పేదవాడి వద్దకు వచ్చిందని జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట దగ్గర ఉన్న కోర్టు నిర్మాణం 4 వేల 400 కోట్లు ఖర్చుపెట్టి చెక్ స్పీడ్ లో నిర్మాణం జరుగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్లు కూడా శరవేగంగా నిర్మిస్తున్నామన్నారు. ప్రజలకు ప్రగతి బాట వేయడమే తన ధ్యేయమని .. అందుకే ప్రజలు తనను గెలిపించాలని జగన్ పిలుపునిచ్చారు. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :