ఇండో-పాక్ మ్యాచ్ కోసం.. మొబైల్ పిచ్ లు వచ్చేశాయ్!
టీ20 వరల్డ్ కప్లో భారత్, పాకిస్థాన్ తలపడనున్న న్యూయార్క్లోని నసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దాదాపు సిద్ధమైంది. నిర్మాణంలో ఉన్న ఈ మైదానంలో జరిగే 8 మ్యాచ్ల కోసం అత్యంత కీలకమైన డ్రాప్ డౌన్ (మొబైల్) పిచ్ల అమరిక ఆరంభమైందని ఐసీపీ తెలిపింది. అడిలైడ్ ఓవల్ హెడ్ క్యూరేటర్ డామియన్ హౌగ్ పర్యవేక్షణలో ఫ్లోరిడాలో తయారు చేసిన పది పిచ్లను భారీ ట్రక్కుల ద్వారా స్టేడియానికి తరలించారు. వీటిల్లో నాలిగింటిని మ్యాచ్ల కోసం మిగతా ఆరు పిచ్లను ప్రాక్టీస్ కోసం ఉపయోగించనున్నారు.
Tags :