బిలియనీర్ జాబితాలోకి సుందర్ పిచాయ్
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ నాన్ ఫౌండర్ టెక్ ఎగ్జిక్యూటివ్గా అరుదైన మైలురాయిని సాధించే దశలో ఉన్నారు. 51 సంవత్సరాల సుందర్ పిచాయ్ 2015 నుంచి గూగుల్ సీఈఓగా ఉన్నారు. అప్పటి నుంచి గూగుల్ స్టాక్ 400 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. ఏఐ ఆధారిత వృద్ధి గణనీయంగా ఉండటంతో కంపెనీ షేర్లు పెరుగుతున్నాయి. కంపెనీ మొదటిసారి డివిడెండ్ ప్రకటించింది. భారీ స్టాక్ అవార్డ్సుతో పాటు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే ఎగ్జిక్యూటివ్లలో ఒకరిగా సుందర్ పిచాయ్ సంపద 1 బిలియన్ డాలర్లకు పెంచింది. చెన్నయ్కి చెందిన పిచాయ్ సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. పిచాయ ప్రస్తుత నికర విలువ షేర్ హెల్డింగ్స్ 424 మిలియన్ డాలర్లుగా ఉందని తెలిసింది. ఆయన సీఈఓగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి 600 మిలియన్ల షేర్లు విక్రయించారు. ఈ డబ్బును తిరిగి ఆయన పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది.