కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, లేఖను అధినేత కేసీఆర్కు పంపారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన గాంధీభవన్కు చేరుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యావహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత, కె.జానారెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలతో భేటీ అయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్లో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు వ్యతిరేకించడంతో ఆగిపోయారు. నాలుగైదు రోజుల క్రితం వివిధ కారణాలతో పార్టీని వీడిన వారిని, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం త్రిసభ్య కమిటీని సైతం ఏర్పాటు చేసింది. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి చేరికకు మార్గం సుగమమైంది.