ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. రాజ్భవన్లో వీరి భేటీ 30 నిమిషాలు పాటు కొనసాగింది. ప్రధాని మోదీని కలుసుకున్న వారిలో పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి, అల్లుడు, మాజీ ఐపీఎస్ అదికారి కె.ఆర్.నందన్, మనవడు, బీజేపీ నాయకుడు ఎన్.వి.సుభాష్ తదితరులు ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో సత్కరించినందుకు గాను ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఎన్.వి.సుభాష్ తెలిపారు.
Tags :