ASBL NSL Infratech

వికసిత్ భారత్ అంబాసిడర్లుగా యువతదే కీలక పాత్ర : నిర్మలా సీతారామన్

వికసిత్ భారత్ అంబాసిడర్లుగా యువతదే కీలక పాత్ర : నిర్మలా సీతారామన్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370, ఎన్డీయే పక్షాలతో కలిసి 400 పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు.  విశాఖపట్నంలో ఆమె పర్యటించారు. దీనిలో భాగంగా గీతం వర్సిటీలో వికసిత్‌ భారత్‌ కార్యక్రమం కింద విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. తాము గెలిచే స్థానాల సంఖ్య స్థిర నిర్ణయాల అమలుకు దోహదం చేస్తుందన్నారు. వికసిత్‌ భారత్‌ అంబాసిడర్లుగా యువతదే కీలక పాత్ర అని తెలిపారు. కొత్త ఆవిష్కరణల కోసం కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. రూ.22 వేల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. కృత్రిమ మేధ ఆవిష్కరణల్లో భారత్‌ అగ్రగ్రామిగా ఉందని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :