ASBL NSL Infratech

బొత్స సత్యనారాయణ పై పురందేశ్వరి ఫైర్..

బొత్స సత్యనారాయణ పై పురందేశ్వరి ఫైర్..

భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. దేశంలో బీజేపీ అతిపెద్ద అవినీతి పార్టీ అని పేర్కొన్న బొత్స.. ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారు అని మండిపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రాలో చంద్రబాబు, పవన్ తో కలిసి మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న విజయవాడలో కూటమి భారీ సభను ఏర్పాటు చేసింది.ఈ నేపథ్యంలో మోదీ ను విమర్శించిన బొత్స.. ఇద్దరు తోడుదొంగలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదువుతున్నారు అని అన్నారు. అంతేకాదు నిజా నిజాలు పరిశీలించకుండా ఏ స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చదివేస్తారా అని మోదీని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పురందేశ్వరి.. మోడీ లాంటి వ్యక్తిని విమర్శించే అర్హత బొత్సకు లేదని పేర్కొన్నారు. అంతేకాదు మీరు చేసిన వేగన్స్ క్యాంప్ ప్రజలు ఇంకా మర్చిపోలేదు అని పురందేశ్వరి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖకు రైల్వే జోన్ ఇస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని పురందేశ్వరి మండిపడ్డారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. బొత్స లాంటి అవినీతిపరులకు ప్రపంచమంతా అవినీతిమయంగా కనిపిస్తుంది అని ఎద్దేవా చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :