అక్కడ పోటీలోనే ...మిగిలిన 16 స్థానాల్లో మద్దతు
లోక్సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి బరిలో నిలిపిన అభ్యర్థిని ఉపసంహరించబోమని సీపీఎం స్పష్టం చేసింది. అక్కడ పోటీలోనే ఉంటామని కాంగ్రెస్ పార్టీకి తేల్చి చెప్పింది. అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని బృందంతో తన నివాసంలో సమావేశమై కోరినా ఆ పార్టీ మాత్రం ఆయన వినతిని తోసిపుచ్చింది. తమ పార్టీ స్వతంత్ర రాజకీయ విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయం తీసుకుందన్నారు. భువనగిరిలో తమ పార్టీ అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ను బలపర్చాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మిలిగిన 16 స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపర్చాలని ప్రజలను కోరారు.