ఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక నిందితుడు ప్రభాకర్ రావు పై అరెస్ట్ వారెంట్ జారీ..
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విషయంలో ముఖ్య నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. సీఆర్ పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావుపై అరెస్టు వారంటూ జారీ చేయాల్సిందిగా పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. అరెస్టుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు చాలా కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది.. అందుకే ఈ కేసు నమోదైన వెంటనే అతను విదేశాలకు పారిపోయారు. ఏ ఎయిర్ పోర్ట్ లో అతను కనిపించిన పట్టుకునే విధంగా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.