ASBL NSL Infratech

సాయిచరణ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

సాయిచరణ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

షాద్‌నగర్‌ నియోజకవర్గం నందిగామలో ఈ నెల 26న అగ్నిప్రమాదం జరిగిన సందర్భంగా ఆరుగురిని కాపాడిన సాహస బాలుడు సాయి చరణ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందించారు. సాయిచరణ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులను కూడా సీఎం తన నివాసానికి పిలిపించి శాలువ, పూలబోకే ఇచ్చి అభినందించారు. కష్టపడి చదవాలని తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదం సందర్భంగా ఆరుగురిని ఎలా కాపాడారో 15 ఏళ్ల సాయిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, ఇతర నేతలు చంద్రపాల్‌, కుమారస్వామి గౌడ్‌ పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :